Friday, 16 May 2025

తేలిక తాలూకు మహిమ


నాథే యాతే మధుపుర మతి
       క్షోభ విభ్రష్టచిత్తా
గోపీ కాచిత్కలయతి సఖీ
      రంతరంగాః సమీపే 
ప్రాణత్యాగాదతి గురుతరే 
      తస్యబంధోర్వియోగే
కేన స్థేయం ముహురిత వచో
       వ్యాకులా స్తా బభాషే. 

Sunday, 11 May 2025

వేమన గురువు చెప్పిన విముక్తివిద్య


 "తునాతున్క లగుచున్న 'కడిద'ము అను నల్లని రంగుపూత గల కాగితముపై పిండిబలపముతో వ్రాయబడియున్న యీ పద్యము లొక ప్రాచీన శతకములోనివి" అన్న గగుర్పాటు కలిగించే వాక్యంతో భారతి పత్రిక 1930 వ సంవత్సరం మార్చి సంచికలో "వటమూలమందిరా!" అన్న శీర్షికతో ఈ ఐదు పద్యాలు అచ్చయ్యాయి.

Tuesday, 6 May 2025

శైవశతకరత్నాలు

తెలుగు చాటుసాహిత్యంలోని శైవకవితలు నా మనసుని మహదానందంలో ముంచివేసాయి. శివభక్తి, శరణాగతి వంటి ఉత్తమగుణాలతో పాటు ప్రాకృతసాహిత్యంలో మాత్రమే దొరికే దగ్గరితనం, దేశీయత తెలుగులో శైవసాహిత్యంలో నాకు దొరికింది. 

Monday, 28 April 2025

పాఠకాభిగమనం


పుట్టపర్తి వారి జగద్విదితమైన కావ్యం “శివతాండవము” నకు వాగ్దేవి నా ద్వారా వ్రాయించుకున్న “సహాయవల్లి” వ్యాఖ్య నాకు ఎంతో ప్రత్యేకమైన రచన. దీనికి ముందుమాటలు గానూ, ఈ కృతి ఆవిష్కార సమయంలో స్పందనలు గానూ ఎందరో పెద్దలు, పండితులూ చల్లని పలుకులను ఈ రచనపై కురిపించారు. రచనను చదివి మరికొందరు తమ సహృదయస్పందనలను అందించారు. వారందరికీ ప్రత్యేకకృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇప్పటికి కలిగింది.

Thursday, 27 March 2025

మణిపూసలు: 5 - రంగనాథుని శివకవిత

రగడ శివకవుల సొత్తు. ఈ ఛందోరూపం తెలుగునేలపై శివకవుల చేతులలో పడి యెన్ని వయ్యారాలు పోవాలో అన్నీ పోయింది. ఈ ఛందస్సు పద్యకవితలలోని ఆవృత్తి ధర్మాన్నీ, జానపదాలలోని సంగీత ధర్మాన్నీ తనలో కలుపుకున్న అతి తక్కువ ఛందస్సులలో ఒకటి. దేశీయ ఛందస్సులకున్న ఈ లక్షణమే శివకవులని ఆకర్షించిందనుకుంటాను. రగడ, ద్విపద వంటి దేశీయ ఛందస్సులు కాస్త పాటల రూపం వైపు ఒగ్గినా, వీటి నిర్మాణానికి అనన్యసామాన్యమైన ధార కావాలి.

Wednesday, 26 March 2025

మణిపూసలు: 4 - అపూర్వాంధ్రశివకవి చక్రపాణి రంగనాథుడు

తెలుగుదేశంలో శివకవియుగం భక్తితో ప్రజల జీవనాన్ని సుసంపన్నం చేయడంతో పాటుగా తెలుగుభాషకూ ఎనలేని సేవ చేసింది. ఆ యుగంలో కవిత్రయం పాలుకురికి సోమనాథుడు, పండితారాధ్యులు, నన్నెచోడుడు తెలుగు దేశీయతకి ఒక కొత్త వేదికని నిర్మాణం కావించారు. ఈ యుగంలోనే తెలుగునేలమీద ఉదయించిన ఒక విలక్షణ కవి రంగనాథుడు.

Sunday, 23 March 2025

తల్లీకూతుళ్ల విద్యావాల్లభ్యం

          

17వ శతాబ్దపు తంజావూరు విద్యకు జీవగర్ర. ముఖ్యంగా ఆనాటి దీక్షితుల నట్టిళ్లు పాండిత్యానీకీ కవిత్వానికీ పుట్టిళ్లు. అచ్చన్న దీక్షితులు, రంగరాజాధ్వరి, అప్పయదీక్షితులు, రత్నఖేట శ్రీనివాస దీక్షితులు, సమరపుంగవ దీక్షితులు, యజ్ఞనారాయణ దీక్షితులు, రామభద్ర దీక్షితులు, నీలకంఠ దీక్షితులు, గోవింద దీక్షితులు - ఒక్కొక్కరూ ఒక్కొక మహామేరువు. ఈ కవుల పేర్లు తలచుకుంటేనే, వారి కృతులను గుర్తుచేసుకుంటేనే, వారి ఊపిరి వెనుక ఆదర్శాలను స్మరించుకుంటేనే మేను పులకాంకురితమౌతుంది.

Saturday, 22 March 2025

గురుమూర్తిర్గుణనిధిః

    


2020 వ సంవత్సరంలో నేను మిడిమిడి జ్ఞానంతో సంస్కృతశ్లోకాలకు వ్యాఖ్య వ్రాస్తూ ఫేస్ బుక్ లో ప్రచురిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా నాకు ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఒక మందారపు మొక్క కుండీ ఛాయాచిత్రం. రెండు విచ్చిన పన్నీరుపూవు రంగు మందారపూవులు, పక్కనే జీవాన్ని నింపుకుని ఉబ్బి ఉన్న మందారమొగ్గఒకటి, భగవంతుని అరచేతులలాంటి పచ్చని ఆకులు. బ్రతుకుకాంతిని ఒకలబోస్తున్న ఆ కుండీ బొమ్మను చూస్తూ దానితో పాటు ఉన్న మహార్ఘమైన శ్లోకాన్ని కాసేపు చూడనేలేదు -

Wednesday, 29 January 2025

మణిపూసలు:3 - భ్రమరాంబామల్లీశ్వర సంవాదము

కొన్ని యోజనాలదూరంలో ఉన్న వస్తువునైనా మనసుకి తెచ్చుకోగలగడం మనకి మాత్రమే సాధ్యపడిన విద్య. భగవదుపాసన సహజంగా భారతదేశమనే పొదకి పుష్పించిన పూవు. భారతజాతి తాను ఉపాసించే దైవమనే వస్తువుకి తన సర్వమూ అర్పణ చేసింది. కటిక ఉపవాసాది ఆచారాలతో భౌతిక సుఖాలని తెంపుకుంది. యెనలేని బలంతో మనసుని తన దేవత ముందు పెట్టింది. దాని ఫలితంగా వేరెవ్వరూ ఊహించని భగవత్సుఖంలో తేలియాడగలిగింది. లౌకికసుఖాలని కొనగోరుతో నేలరాయగలిగింది.