పుట్టపర్తి వారి జగద్విదితమైన కావ్యం “శివతాండవము” నకు వాగ్దేవి నా ద్వారా వ్రాయించుకున్న “సహాయవల్లి” వ్యాఖ్య నాకు ఎంతో ప్రత్యేకమైన రచన. దీనికి ముందుమాటలు గానూ, ఈ కృతి ఆవిష్కార సమయంలో స్పందనలు గానూ ఎందరో పెద్దలు, పండితులూ చల్లని పలుకులను ఈ రచనపై కురిపించారు. రచనను చదివి మరికొందరు తమ సహృదయస్పందనలను అందించారు. వారందరికీ ప్రత్యేకకృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇప్పటికి కలిగింది.